జాతీయ చిహ్నం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

జాతీయ చిహ్నం  కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

న్యూఢిల్లీ: నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనం పైకప్పుపై  కాంస్యంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కాంస్య విగ్రహం ఎత్తు ఆరున్నర మీటర్లు. విగ్రహావిష్కరణ అనంతరం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికులతో మోడీ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.